యాప్నగరం

కేంద్రమంత్రి అమిత్‌షాను కలిసిన విజయశాంతి

బీజేపీలోకి రాములమ్మ చేరికకు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఆ పార్టీ పెద్దలతో ఆమె చర్చలు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు విజయశాంతి కాషాయం కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.

Samayam Telugu 7 Dec 2020, 7:15 am
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో అమిత్‌షాను కలిశారు. అమిత్ షాకు శాలువా కప్పి గౌరవించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, బీజేపీ నేత వివేక్ పాల్గొన్నారు. మరోవైపు విజయశాంతి ఇవాళ బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. సోమవారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో విజయశాంతి కాషాయదళంలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu అమిత్ షాను కలిసిన విజయశాంతి
vijayasanthi meet amit shah


మరోవైపు వివిధ పార్టీలకు చెందిన మరికొంతమంది ముఖ్యనేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీలోకి జోరుగా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు చేరారు. ఇప్పుడు విజయశాంతి కూడా బీజేపీలోకి వెళ్తుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీ నుంచి విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఆమె సొంత గూటికి చేరుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.