యాప్నగరం

ఈసారి అయినా ఆ పనిచేయండి.. విజయశాంతి విజ్ఞప్తి

కాషాయం కలర్ మాస్క్ ధరించి ఓటు వేసేందుకు విజయశాంతి వచ్చారు. దీంతో ఆమె త్వరలోనే బీజేపీలో చేరిపోతారని అంతా జోరుగా చర్చించుకుంటున్నారు.

Samayam Telugu 1 Dec 2020, 5:46 pm
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కాంగ్రెస్ నాయకురాలు, ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి . ఈ సందర్భంగా ఆమె గ్రేటర్ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లోనైనా ప్రజలు మంచివారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు విజయశాంతి. హైదరాబాదును, తెలంగాణను కాపాడుకోవడం ప్రజల చేతిల్లోనే ఉందని ఆమె అన్నారు. అందుకే మంచి వారిని ఎన్నుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ప్రముఖ నటి విజయశాంతి బంజారాహిల్స్‌ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Samayam Telugu విజయశాంతి
vijayasanthi


Read More: Ghmc Polling: ఓటర్లు లేక పోలింగ్‌ బూతుల్లో పడుకున్న సిబ్బంది

ఇవాళ ఓటు వేసిన సమయంలో ఆమె కాషాయం కలర్ మాస్కు పెట్టుకొని వచ్చారు. దీంతో విజయశాంతి మాస్క్ హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఆమె త్వరలోనే బీజేపీలో చేరిపోతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె బీజేపీకి సంబంధించిన పలువురు అగ్రనేతల్ని సైతం కలిశారు. హైదరాబాద్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో సమావేశం అయిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా ఆమె భేటీ అయ్యారు. మరో వారంలో విజయశాంతి బీజేపీలో చేరుతారని విశ్వసనీయ సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.