యాప్నగరం

రైతులు ఇలాంటి పనులు చేయరు, వారి ప్రయత్నాలు ఫలించవు: విజయశాంతి

Hyderabad: ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని విజయశాంతి ఆరోపించారు. వారు చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని అన్నారు. మంగళవారం ఫేస్‌బుక్ వేదికగా విజయశాంతి ఈ వ్యవహారంపై స్పందించారు.

Samayam Telugu 26 Jan 2021, 10:28 pm
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలపై తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. రైతులు ఇటువంటి హింసకు పాల్పడబోరని విజయశాంతి అభిప్రాయపడ్డారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ఆరోపించారు. వారు చేస్తున్న ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయని చెప్పారు. మంగళవారం ఫేస్‌బుక్ వేదికగా విజయశాంతి ఈ వ్యవహారంపై స్పందించారు.
Samayam Telugu విజయశాంతి
Vijayashanti


‘‘రైతుల ర్యాలీ సందర్భంగా ఢిల్లీలో చోటు చేసుకున్న సంఘటనలు నిజంగా విచారకరం. పోలీసులపై దాడులు, ఎర్రకోటపై జెండాల ఎగరవేత తదితర పరిణామాలను గమనిస్తే.. ఇవన్నీ విపక్ష ప్రేరేపిత శక్తుల కుట్రేనని తెలుస్తోంది. కేంద్రం ఎన్నిసార్లు చర్చలకు పిలిచినా ఓపికగా వచ్చిన రైతులు ఇటువంటి హింసకు పాల్పడరు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న రైతులతో సంబంధం లేని వ్యక్తులు వారిలో చేరి అన్నదాతలను ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారో సోషల్ మీడియాలో రుజువులతో సహా పలు వీడియో సాక్ష్యాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి.

కేంద్రానికి, రైతులకు మధ్య జరుగుతున్న చర్చలు ఫలవంతమైతే జనంలో నామరూపాలు లేకుండా పోతామనే భయంతోనే ప్రతిపక్షాలు రైతుల్ని రెచ్చగొడుతూ రిపబ్లిక్ డేని అందుకు సందర్భంగా ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. రైతు చట్టాలపై విపక్షాల దుష్ప్రచారం.. చర్చల్ని చెడగొట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు కచ్చితంగా విఫలమవుతాయి. కేంద్రం ఇప్పటికే రైతుల ఆందోళనను ఉపశమింపచేస్తూ ఈ చట్టాల అమలుకు సంబంధించి పలు చర్యలు తీసుకుంది. త్వరలోనే మరిన్ని సత్ఫలితాలు వెలువడతాయని నేను ఆశాభావంతో ఉన్నాను.’’ అని విజయశాంతి ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.