యాప్నగరం

బీజేపీలోకి విజయశాంతి? క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

Telangana Congress: కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే.

Samayam Telugu 28 Oct 2020, 8:03 pm
తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి బీజేపీలో చేరుతారంటూ మూడ్రోజులుగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నారని కాషాయ కండువా కప్పుకోవడం ఖాయమంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ దీనిపై వివరణ ఇచ్చారు. విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటారని కుసుమ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన విజయశాంతితో భేటీ అనంతరం విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu విజయశాంతి (ఫైల్ ఫోటో)
Vijayashanti


‘‘విజయశాంతికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే ఎంతో గౌరవం. కరోనా కారణంగా ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. పార్టీ మారతారనే ప్రచారం అవాస్తవం. విజయశాంతిని మేమంతా ఎంతో గౌరవిస్తాం. కరోనా కారణంగానే కొత్త ఇన్‌ఛార్జ్‌ను ఆమె కలవలేదు.’’ అని అన్నారు.

కాగా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి సోమవారం విజయశాంతి నివాసానికి వెళ్లి ఆమెతో దాదాపు గంటపాటు భేటీ అయిన విషయం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికలు ఓవైపు, విజయశాంతి చాలాకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న వేళ ఆమె పార్టీ మారతారనే అంశం జోరందుకుంది. ఇదే సమయంలో కిషన్‌రెడ్డితో భేటీ కావడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.