యాప్నగరం

ప్రాణం తీసిన పతంగి.. కరెంట్ షాక్‌తో బాలుడి దుర్మరణం, మరొకరి పరిస్థితి విషమం

వికారాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. హైటెన్షన్ వైర్లకు చిక్కుకుపోయిన గాలిపటాన్ని తీసే క్రమంలో ఇద్దరు చిన్నారులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Samayam Telugu 8 Dec 2019, 7:54 pm
వికారాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. పతంగి ఎగరేస్తుండగా.. కరెంట్ షాక్ తగలడంతో ఓ బాలుడు దుర్మరణం చెందగా.. మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. పరిగి మండలం బాహర్‌పేట్‌కు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌ జాహెద్‌ అలీ కుమారుడు జహీర్‌ (9), పండ్ల వ్యాపారి రఫీ కుమారుడు సమీర్‌ ఇంటి డాబాపై పతంగులు ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో వీరు ఎగరేస్తున్న గాలిపటం హైటెన్షన్ వైర్లకు చిక్కుకుంది. దాన్ని తీసేందుకు ప్రయత్నించే క్రమంలో.. పిల్లలిద్దరికీ కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో జహీర్ అక్కడికక్కడే మృతి చెందగా సమీర్ పరిస్థితి విషమంగా ఉంది.
Samayam Telugu వికారాబాద్‌లో విషాదం


హైటెన్షన్ వైర్లకు తగిలిన పతంగిని రాడ్‌తో తీయడానికి ప్రయత్నించడమే ప్రమాదానికి ప్రధాన కారణం అని తెలుస్తోంది. కరెంట్ షాక్ తీవ్రతకు జహీర్ కాలు శరీరం నుంచి వేరుపడింది. గాయపడిన సమీర్‌ను చికిత్స నిమిత్తం వెంటనే హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనలో కరెంట్ వైర్లు తెగి.. కింద ఉన్న మరో వ్యక్తి మీదపడ్డాయి.

పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన స్థానికులు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేనుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.