యాప్నగరం

కల్తీ కల్లుకు మరొకరు బలి.. మూడుకు చేరిన మరణాల సంఖ్య

వికారాబాద్‌లో కల్తీ కల్లు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే దీనికి ఇద్దరు బలయ్యారు. తాజాగా మరో మహిళ కూడా కల్తీ కల్లు తాగి చనిపోయింది.

Samayam Telugu 18 Jan 2021, 4:30 pm
వికారాబాద్‌లో కల్తీ కల్లు కలకలం రేపిన విషయం తెలిసిందే. కల్తీ కల్లు తాగి వందల సంఖ్య జనం ఆస్పత్రి పాలయ్యారు. అయితే తాజాగా కల్తీ కల్లుకు మరొకరు బలి అయ్యారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో ఇవాళ మరో మహిళ మృతి చెందింది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం మరణించింది.దీంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఈ నెల 13న కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
Samayam Telugu కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి


Read More: హిజ్రాతో యువకుడి వెదవ పని.. అందరు చూస్తుండగానే బూతులు తిడుతూ

వికారాబాద్‌, నవాబ్‌పేట్‌ మండలాల్లో కల్తీకల్లు తాగి 300 మందికిపైగా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే అస్వస్థతకు కారణమైన చిట్టిగిద్ద కల్లు డిపోను అధికారులు ఇప్పటికే సీజ్‌ చేశారు. జిల్లావ్యాప్తంగా అన్ని కల్లు దుకాణాలను మూసివేశారు. కల్తీ కల్లు ఘటనకు గల కారణాలపై ఎక్సైజ్‌ అధికారులతోపాటు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కల్తీ కల్లుకు ఇటీవలే ఇద్దరు బలయ్యారు. అక్కడి కల్లులో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. ఆల్ఫ్రా జోలం, డైజోఫామ్ డోసేజ్ ల కారణం గానే ఆ ఇద్దరు మృతిచెందినట్టు నిర్ధారణకు వచ్చారు. మొదట అనుమానాలు వ్యక్తం కావడంతో.. శాంపిల్స్‌ సేకరించిన అధికారులు.. టెస్ట్‌ చేయగా... కల్తీ కల్లు కారణంగా ఇద్దరు మృతిచెందినట్టు తేలినట్టుగా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.