యాప్నగరం

ఆ ఊరు ఊరంతా కరోనా... ఎలా సోకిందంటే

ఆ గ్రామంలో మొత్తం జనాభా 500. సహపంక్తి భోజనాలు చేశారు. ఇప్పటికే వందమందికి వైరస్ సోకింది. దీంతో ఊరంతా ఐసోలేషన్‌లో ఉంది. మిగిలిన వారు కూడా టెస్టులు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Samayam Telugu 3 Sep 2020, 1:20 pm
పెళ్లికెళ్తే కరోనా.. చావుకు వెళ్తే కరోనా.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లిన మన వెంటపడి వేధిస్తోన్న వైరస్ కరోనా. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో అన్ లాక్ ప్రక్రియ కూడా కావడంతో జనం కూడా కరోనాతో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. ఈక్రమంలో ఏ కార్యక్రమం కోసం అయిన ఓ పదిమంది కూడితే అక్కడ కరోనా కూడా ప్రత్యక్షమవుతోంది. తాజాగా తెలంగాణలో ఓ ఊరు ఊరంతా కరోనా బారిన ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీఆర్కే పురంలో ఊరిలో దాదాపుగా ప్రజలందరికీ దాదాపు కరోనా సోకింది.
Samayam Telugu ఊరంతా కరోనా (ఫైల్ ఫోటో)
village infected with corona


అయితే దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆ ఊరిలో ఓ వ్యక్తి దినకర్మ సహపంక్తి భోజనాలే ఇందుకు కారణం. సహపంక్తి భోజనాలు చేసిన సగం మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గ్రామ పంచాయతీలో 500 జనాభా ఉంటే 100కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలంతా భయంతో ఇళ్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఊరిలో మిగిలిన వారు కూడా కరోనా టెస్ట్‌లకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Read More: వాహనదారులకు శుభవార్త.. ఇక ఆన్ లైన్లోనే డ్రైవింగ్ లైెసెన్స్ రెన్యువల్

అంతా టెస్ట్‌లు చేయించుకుంటే ఇంకెన్ని కేసులు బయటపడతాయోనని భయపడుతున్నారు. మరోవైపు కరోనా భయంతో జనమంతా హోం ఐసోలేషన్ కు పరిమితమయ్యారు. గ్రామస్థులెవరూ ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. కరోనా కేసులు ఎక్కువగా రావడంతో గ్రామానికి వచ్చే రోడ్లను కూడా దిగ్బంధం చేశారు అధికారులు. గ్రామాల్లోకి ఎవరిని రానీయకుండా చర్యలు చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.