యాప్నగరం

వికారాబాద్: సర్పంచ్ ఆత్మహత్య.. క్షమించండీ అంటూ సూసైడ్ నోట్

గత రెండు నెలలుగా తనకు చాలా ఇబ్బందిగా ఉందని.. నరకప్రాయంగా ఉందన్నాడు. మానసికంగా, శారీరకంగా చాలా క్షోభకు గురవుతున్నాను అన్నాడు. తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తనకు మానసికంగా ఎంతో వైద్యం అందించడం వల్ల జీవించానని.. తనకు మరణించాలని లేదన్నాడు.

Samayam Telugu 24 Jun 2020, 11:29 am
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పూడూరు మండలం కొత్త పల్లి సర్పంచ్ ఆనంద్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్పాట్‌లో సూసైడ్ నోట్ దొరికింది. తన చావుకు ఎవరు కారణం కాదని.. కొద్ది రోజులుగా మానసిక క్షోభకు గురవుతున్నానని అందులో రాశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటూ స్థానికుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు.
Samayam Telugu సర్పంచ్ ఆత్మహత్య


సర్పంచ్ తన లేఖలో.. గత రెండు నెలలుగా తనకు చాలా ఇబ్బందిగా ఉందని.. నరకప్రాయంగా ఉందన్నాడు. మానసికంగా, శారీరకంగా చాలా క్షోభకు గురవుతున్నాను అన్నాడు. తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తనకు మానసికంగా ఎంతో వైద్యం అందించడం వల్ల జీవించానని.. తనకు మరణించాలని లేదని.. కానీ జీవచ్ఛవంగా ఎన్ని రోజులు జీవించి ప్రయోజనం లేదన్నాడు. అధికారికంగా తాను విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని.. తన మిత్రుల్ని మానసికంగా ఇబ్బంది కలిగించాను అన్నాడు. అందరూ తనను క్షమించాలని కోరాడు. అందరూ ఆందనంగా జీవించాలని ఆకాక్షించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.