యాప్నగరం

శిలాఫలకానికి బర్త్‌డే కేక్.. కొత్త ఒరవడి, కాకపోతే నిరసన!

Jagtial | శిలాఫలకం వద్ద కేక్ కట్ చేసి ఓ గ్రామ యువకులు వినూత్న నిరసన చేపట్టారు. రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి ఏడాది గడుస్తున్నా.. పనులు మాత్రం ప్రారంభించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 31 Aug 2019, 7:51 pm
శిలాఫలకానికి బర్త్ డే కేక్ కట్ చేసిన ఘటన తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. మనుషులకు, పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం ఇటీవల సర్వసాధారమైంది. ఇదే క్రమంలో శిలాఫలకాలకూ బర్త్ డే కేక్ కట్ చేస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారా అంటే పొరబడ్డట్లే. ఇది పక్కా నిరసన కార్యక్రమం. ఏడాది పూర్తవుతున్నా రోడ్డు పనులు చేపట్టకపోవడంతో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో శనివారం (ఆగస్టు 31) చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
Samayam Telugu Jagtial


మేడిపల్లి మండలంలో మన్నెగూడం - భీమారం గ్రామాల మధ్య రోడ్డు పనులకు గతేడాది అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. శిలాఫలకం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయినా.. రహదారి నిర్మాణ పనులు మాత్రం ప్రారంభించలేదు. దీంతో మన్నెగూడెం గ్రామస్థుల్లో ఓపిక నశించింది. గ్రామానికి చెందిన కొంత మంది యువకులు అధికారులు, నాయకులు తీరును నిరసిస్తూ.. శిలా ఫలకం వద్ద కేక్ కట్ చేసి నిరసన వ్యక్తం చేశారు.

Don't Miss: తప్పుడు వార్తలతో అవమానించాలని చూడొద్దు.. మంత్రి ఈటల

భీమారం, మన్నెగూడెం రోడ్డు పనులకు నాటి కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌ బాబు, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌ బాపురెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు రూ.1.60 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. కానీ, నిర్మాణ పనులు నేటికీ ప్రారంభించకపోవడంతో మన్నెగూడెంల వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Must Read: గవర్నర్ నరసింహన్‌ను బదిలీ చేస్తున్నారా.. ఆ మాటల వెనుక అర్థమిదేనా?

గత ఏడాది ఆగస్టు 31న మన్నెగూడెం-భీమారం మధ్య రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు, అప్పటి ఎంపీ వినోద్ కుమార్, మార్క్‌‌ఫెడ్ ఛైర్మన్ బాపురెడ్డి శంకుస్థాపన చేశారు. ఐతే శిలా ఫలకం ఏర్పాటుచేసినా ఏడాదైనా పనులు ప్రారంభించలేదు. రోడ్డు అప్పుడు ఎలాగైతే ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరింత అధ్వాన్నంగా తయారైంది. అధికారుల నిర్లక్ష్యంపై మన్నెగూడం యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే శిలాఫలకానికి కేక్ కట్ చేసి వినూత్నంగా నిరసన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.