యాప్నగరం

కామారెడ్డి: కరోనా పోవాలని ఊరంతా ఖాళీ.. మళ్లీ రాత్రికి..

Kamareddy: కరోనా నేపథ్యంలో ఆదివారం కూడా జనాలు అందరూ ఊరు విడిచి బయట ఉండాలని నిర్ణయించారు. అంతకు ముందు గ్రామ దేవతలకు ఘనంగా పూజలు నిర్వహించారు.

Samayam Telugu 11 Oct 2020, 4:34 pm
కరోనా వైరస్ మహమ్మారి తమను పూర్తిగా వదిలిపోవాలని గ్రామాల్లో ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మొత్తం ఈ మూఢ నమ్మకాన్ని పాటించింది. వైరస్‌ను పారద్రోలాలనే లక్ష్యంతో ఊరి జనమంతా కలిసి తమ ఇళ్లను ఖాళీ చేసి దూరంగా వన భోజనాలకు వెళ్లారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
coronavirus


కరోనా నేపథ్యంలో ఆదివారం కూడా జనాలు అందరూ ఊరు విడిచి బయట ఉండాలని నిర్ణయించారు. అంతకు ముందు గ్రామ దేవతలకు ఘనంగా పూజలు నిర్వహించారు. గ్రామ దేవతను డప్పు వాయిద్యాలతో ఊరంతా ఊరేగించారు. ఆ తర్వాత గ్రామం విడిచి వన భోజనాలకు వెళ్లారు. మళ్లీ రాత్రిలోగా ఊళ్ళోకి రావాలని అందరూ అనుకున్నారు. ఇలా చేస్తే గ్రామ దేవతలు తమను కరోనా బారి నుంచి కాపాడతారని నమ్ముతున్నారు. తమను ఎలాంటి వ్యాధులు దరి చేరకుండా దేవతలు ఆశీర్వదిస్తారని బీబీపేట ఊరి వాసులు విశ్వసిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో మరో రెండు గ్రామాలు నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామం లోనూ ఇలాంటి కట్టుబాట్లే కనిపించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.