యాప్నగరం

టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. చెప్పులు విసిరిన గ్రామస్థులు

ఫార్మా కంపెనీ వల్ల భూములు కోల్పొతుంటే ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, రైతులపైనే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రైతులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు కూడా లాఠీ ఛార్జ్ జరిపారు.

Samayam Telugu 15 Oct 2020, 1:08 pm
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి పర్యటనలో చేదు అనుభవం ఎదురయ్యింది. యాచారం మండలం మేడిపల్లిలో భారీ వర్షాలకు నిండిన చెరువు దగ్గర పూజలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి నిరసన సెగ తాకింది. గ్రామంలోకి ఎమ్మెల్యే రావడానికి వీల్లేదు అంటూ ఎమ్మెల్యే కారుపై రైతులు చెప్పులు విసిరి నిరసన తెలిపారు రైతులు. దీంతో ఎమ్మెల్యే పర్యటనలో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారుల్ని చెదరగొట్టారు.
Samayam Telugu కిషన్ రెడ్డికి నిరసన సెగ
trs mla kishan reddy


మేడిపల్లి గ్రామం ఫార్మా సిటీలోకి పోతుందని, దీనికి కారణం ఎమ్మెల్యేనేని గ్రామస్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావద్దని స్థానికులు ఆందోళనకు దిగారు. వెంటనే కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఫార్మా కంపెనీ వల్ల తాము భూములు కోల్పొతుంటే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా రైతులపైనే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రైతులు నిరసన తెలియజేశారు.

Read More: నా పర్యటన ఎమ్మార్వో కూడా వచ్చేే స్థాయి కాదా.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసహనం

దీంతో నిరసకారులను అదుపు చేసేందుకు పోలీసులు వారిపై లాఠీ చార్జ్‌ చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఆందోళనకారులను అదపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి పలువురి ప్రజా ప్రతినిధులు, రైతులు ముందస్తు అరెస్టు, ఫార్మాసిటీ ఏర్పాటు చేయద్దు అంటూ నినాదాలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.