యాప్నగరం

మెదక్‌లో విష వాయువు లీక్.. కళ్లు మంటలు, శ్వాస సమస్యలతో జనం ఆందోళన

Medak: ఒక్కసారిగా ఊరంతా పొగ కమ్మకుందని గ్రామస్తులు వెల్లడించారు. దీంతో తీవ్రంగా దుర్వాసన ఏర్పడిందని, పొగ తీవ్రం కావడంతో ఊపిరి ఆడని పరిస్థితి ఎదురైందని వాపోయారు.

Samayam Telugu 28 Aug 2020, 3:21 pm
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామస్తులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి సమీపంలోని మిర్జాపల్లి గ్రామ శివారులోని కార్తికేయ ఫార్మా కంపెనీలో రసాయన లీకేజీ ఏర్పడిందని, దీంతో ఒక్కసారిగా ఊరంతా పొగ కమ్మకుందని గ్రామస్తులు వెల్లడించారు. దీంతో తీవ్రంగా దుర్వాసన ఏర్పడిందని, పొగ తీవ్రం కావడంతో ఊపిరి ఆడని పరిస్థితి ఎదురైందని వాపోయారు. కంట్లో మంటలు వంటి లక్షణాలు కనిపించాయని వివరించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
pharma industries in medak


పరిస్థితి మూలాన్ని గమనించిన గ్రామ ప్రజలు పరిశ్రమ వద్దకు వేగంగా వెళ్లి వారిని నిలదీయడంతో ఉత్పత్తిని నిలిపివేశారని వివరించారు. ఉదయం గ్రామ సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని వెల్లడించారు. అయితే, ఈ విషయంపై పరిశ్రమ ఎండీ కార్తీకేయ స్పందించారు. తమ పరిశ్రమలో తయారయ్యే ఉత్పత్తులు ప్రాణాంతకమైనవి కావని స్పష్టత ఇచ్చారు. అమ్మోనియం సల్పేట్‌‌ను తాము ఉత్పత్తి చేస్తామని తెలిపారు. స్టీమ్‌ పైప్‌ లీకేజీ అవడంతో సమస్య ఏర్పడినట్లు వివరణ ఇచ్చారు.

మరోవైపు, ఈ ఫార్మా కంపెనీని సీజ్‌ చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఫార్మా పరిశ్రమను పరిశీలించి కనీస జాగ్రత్తలు కూడ తీసుకోవడంలేదని మేనేజర్‌ను నిలదీశారు. పరిశ్రమ మేనేజర్‌ నుంచి సరైన స్పందన లేకపోవడంతో పరిశ్రమను సీజ్‌చేస్తున్నట్లు తెలిపారు. పీసీబీ అధికారులు వచ్చి పరిశీలించి నివేదిక ఇచ్చేవరకు పరిశ్రమలో ఉత్పత్తులు నిర్వహించవద్దని అదనపు కలెక్టర్ హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.