యాప్నగరం

ఆర్కే మఠ్‌లో చిన్నారులకు ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాస కోర్సు.. ఆగస్టు 30 నుంచి ఆన్‌లైన్ ద్వారా

ఆధ్యాత్మిక, నైతిక విలువలపై స్వామి వివేకానందుడు బోధనలు, వ్యక్తిత్వ వికాస తరగతులను రామకృష్ణా మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా ప్రస్తుతం వీటిని ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు.

Samayam Telugu 27 Aug 2020, 9:30 am
హైదరాబాద్‌లోని రామకృష్ణా మఠానికి చెందిన వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ (వీఐహెచ్‌ఈ) కరోనా వైరస్ సమయంలో పలు ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తోంది. తాజాగా, వివేకానంద బాల వికాస్ కేంద్రం చిన్నారుల కోసం ‘బాల వికాస్’ పేరుతో ఓ కోర్సును ప్రారంభించనుంది. మొత్తం 53 రోజుల పాటు నిర్వహించే ఈ కోర్సులో ఆరోగ్యం, ఆనందం, ఉత్సాహం, విలువలు తదితర అంశాలను బోధించనున్నారు. నాలుగు నుంచి పది తరగతులకు చెందిన చిన్నారులు ఈ తరగతుల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. గ్రేడ్‌ల వారీగా ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నారు.
Samayam Telugu వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆన్‌లైన్ కోర్సు


మొత్తం 53 రోజుల పాటు నిర్వహించే ఈ క్లాసుల్లో తొలి 39 రోజులు ఉదయం 7.00 గంటల నుంచి 8.00 గంటల మధ్య యోగసనాలు, ధ్యానం తదితర అంశాలను.. తర్వాత 14 రోజులు ఉదయం 8.30 గంటల నుంచి 10.00 గంటల మధ్య నైతిక, ఆధ్యాత్మిక విలువలు, భజనలు, కీర్తనలు బోధిస్తారు. కోర్సులో చేరడానికి రూ.550 ఆన్‌లైన్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఈ తరగతులను ఆగస్టు 30 నుంచి నవంబరు 29 వరకు వివేకానంద బాల వికాస కేంద్రం నిర్వహిస్తోంది. చిన్నారుల్లో వ్యక్తిత్వ వికాసం కోసం ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. పిల్లల్లో నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెరుగుతాయని తెలిపారు. ఔత్సాహవంతులు ఆన్‌లైన్‌లో ముందుగానే పేర్లను నమోదుచేసుకోవాలని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.