యాప్నగరం

కులాలు మారిపోయాయి, అక్షరాలు పేర్లయ్యాయి.. ఓటర్ల జాబితాలో చోద్యాలు!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: వార్డుల రిజర్వేషన్‌లలో కీలకమైన వర్గాల ఓటర్లను గుర్తించడంలో పురపాలక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది రిజర్వేషన్లపై ప్రభావితం పడనుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Samayam Telugu 3 Jan 2020, 10:25 am
రాష్ట్రంలో పురపాలిక ఎన్నికలు దూసుకొస్తున్న నేపథ్యంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో విడుదల చేసిన ఓటర్ల జాబితాల్లో విడ్డూరాలు వెలుగుచూస్తు్న్నాయి. అవన్నీ తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. భార్యాభర్తల పేర్లు వేర్వేరు వార్డుల్లో నమోదు కావడం, మరణించిన వారి పేర్లు ఉండడం, ఒకరి పేరే జాబితాలో పలుమార్లు ఉండడం, ఆఖరికి పేర్ల స్థానంలో ‘చ’, ‘జ’, ‘ప’ వంటి అక్షరాలు కనిపించడం వంటి చోద్యాలు కనిపిస్తున్నాయి. వార్డుల రిజర్వేషన్‌లలో కీలకమైన వర్గాల ఓటర్లను గుర్తించడంలో పురపాలక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇది రిజర్వేషన్లపై ప్రభావితం పడనుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యధిక పురపాలక సంఘాల జాబితాలో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని వార్డుల్లో వందల సంఖ్యలో ఓటర్లు ఒక వర్గం వారైతే మరో వర్గంగా చూపడం గమనార్హం.
Samayam Telugu Voter list muncipal elections


Also Read: బీటెక్ కోర్సుల్లోకి కొత్త సబ్జెక్టు.. వివరాలు వెల్లడించిన మంత్రి కేటీఆర్

రిజర్వేషన్లపై తీవ్ర ప్రభావం
చాలా మున్సిపాలిటీల్లో కులాల వారీగా ఓటర్ల గణన సక్రమంగా చేపట్టలేదు. ఎస్సీ ఓటర్లను బీసీలుగా, బీసీలను ఎస్టీలుగా జాబితాలో చేర్చారు. వీటిపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. కరీంనగర్‌ కార్పొరేషన్‌ 51వ డివిజన్‌లో బీసీలను ఓసీలుగా చేర్చారు. 34వ డివిజన్‌లో బీసీ వర్గానికి చెందిన 800 మందిని ఓసీలుగా గుర్తించారు. 4వ డివిజన్‌లో దాదాపు 300 మంది ఓసీలను బీసీ, ఎస్సీలుగా గుర్తించారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్లు ఉండగా.. దాదాపు అన్ని డివిజన్లలో కుల గణన దారుణంగా ఉందని ప్రభావిత పార్టీల నేతలు వినతి పత్రాలు సమర్పించారు.

Also Read: మాజీ ఎంపీ కవిత త్వరలో మళ్లీ పార్లమెంటుకు.. ఆ సీటు ఇచ్చేందుకు కసరత్తు?

దీనిని బట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపులో మున్సిపల్ అధికారులు స్పష్టమైన విధాలేవీ పాటించలేదని అర్థమవుతోంది. ఓటర్ల గుర్తింపునకు షెడ్యూల్‌ ప్రకటించినప్పుడే చాలా తక్కువ సమయం దీనిపై దృష్టి సారిస్తారు. సాధారణంగా బిల్‌ కలెక్టర్లకు ఈ బాధ్యత అప్పగిస్తారు. వీరిలో అత్యధికం కార్యాలయంలోనే కూర్చొని ఓటర్లలో వివిధ కులాల వారిని గుర్తిస్తారు. ఇంటిపేర్లు, వారు చేసే వృత్తుల ఆధారంగా నిర్ధారణకు వస్తారని తెలిసింది. అంతేకాక, స్థానిక నేతల ప్రలోభాలు, నేతల ఒత్తిళ్లకు ప్రభావితమై కూడా పలుచోట్ల మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: ‘వారిలా కేటీఆర్ అసమర్థుడు కాదు.. తర్వాతి సీఎం ఆయనే..’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.