వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద రీతిలో మరణించడం స్థానికంగా కలకలం రేపింది. 63 ఏళ్ల అజీరాం బీ, ఆమె కూతురు ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనవరాలు హసీనా (10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట పడి ఉన్నాయి. ఆ దృశ్యాలను చూసిన స్థానికులు షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా.. వంట గదిలో అజీరాం బీ, హాల్లో ఆమె మనవరాలు హసీనా, డైనింగ్ హాల్లో ఆస్మా బేగం, ఇంటి వెనక ఖాజా పాషా మృతదేహాలు పడి ఉన్నాయి. ఇంటి ఆవరణలో కుంకుమ, పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు కనిపించాయి. దీంతో నలుగురి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీరు ఆత్మహత్య చేసుకున్నారా.. లేదంటే ఎవరైనా ప్లాన్ ప్రకారం హత్య చేశారా.. అనేది తెలియాల్సి ఉంది. ఇంట్లో ఉన్న వారంతా చనిపోవడంతో ఈ మరణాల మిస్టరీ పోలీసులు సవాల్గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా.. వంట గదిలో అజీరాం బీ, హాల్లో ఆమె మనవరాలు హసీనా, డైనింగ్ హాల్లో ఆస్మా బేగం, ఇంటి వెనక ఖాజా పాషా మృతదేహాలు పడి ఉన్నాయి. ఇంటి ఆవరణలో కుంకుమ, పసుపు, అగరబత్తీలు, నిమ్మకాయలు కనిపించాయి. దీంతో నలుగురి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వీరు ఆత్మహత్య చేసుకున్నారా.. లేదంటే ఎవరైనా ప్లాన్ ప్రకారం హత్య చేశారా.. అనేది తెలియాల్సి ఉంది. ఇంట్లో ఉన్న వారంతా చనిపోవడంతో ఈ మరణాల మిస్టరీ పోలీసులు సవాల్గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.