యాప్నగరం

మంత్రి జగదీశ్ రెడ్డి, ఉత్తమ్ బహిరంగ గొడవ.. నువ్వెంతంటే నువ్వెంతని..

Nalgonda: వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్ధానికి దిగారు. ‘నువ్వు పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్‌ వేసేశారు.

Samayam Telugu 31 May 2020, 7:55 pm
తెలంగాణ విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మధ్య వాగ్వివాదం జరిగింది. నల్గొండ జిల్లా కలెక్టరేట్‌లో ఈ పరిణామం చోటు చేసుకుంది. కలెక్టరేట్‌లో నియంత్రిత సాగు కార్యాచరణ ప్రణాళిక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చలు జరుగుతుండగా మంత్రి జగదీశ్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల వివాదం చెలరేగింది. ఇద్దరు నేతలు పరస్ఫర విమర్శలకు దిగారు. రైతు రుణమాఫీ విషయంలో ఇద్దరి మధ్య వివాదం చెలరేగగా... వేదికపైనే నువ్వెంతా అంటే నువ్వెంతా అంటూ మాటల యుద్ధానికి దిగారు. ‘నువ్వు పీసీసీ చీఫ్‌గా ఉండడం మీ సొంత ఎమ్మెల్యేలకే ఇష్టం లేదు’ అని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై మంత్రి జగదీశ్ రెడ్డి సెటైర్‌ వేసేశారు. ‘నువ్వు మంత్రిగా ఉండడం ఈ జిల్లా ప్రజల దురదృష్టం’ అంటూ మంత్రికి ఉత్తమ్ గట్టి కౌంటర్ విసిరారు.
Samayam Telugu జగదీశ్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
jagadish reddy


Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.