యాప్నగరం

వరంగల్ ప్రజలకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ తర్వాత ఓరుగల్లులోనే!

తెలంగాణలోని రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌లో త్వరలోనే మెట్రో రైలు పరుగులు తీసే అవకాశం ఉంది. 15 కి.మీ. మేర రూ.1400 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంది.

Samayam Telugu 11 Aug 2020, 8:02 am
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరం వరంగల్. ఓరుగల్లును అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలపాలని కేసీఆర్ సర్కారు భావిస్తోంది. హైదరాబాద్-వరంగల్ నగరాలను ముంబై-పుణే తరహాలో అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. పది లక్షల జనాభా దాటిన వరంగల్ నగరం ఇప్పటికే విద్యా రంగంలో ముందంజలో ఉంది. ఐటీ రంగంలోనూ మెల్లగా ఎదుగుతోంది. వరంగల్ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ మెట్రో రైలును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
Samayam Telugu warangal


మహారాష్ట్రలోని ‘మహా మెట్రో’ తరహాలో వరంగల‌్‌లో నియో మెట్రో ఏర్పాటు కోసం కేటీఆర్ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌, థానే, పుణె, నాసిక్‌ నగరాల్లో అనుసరించిన విధానంలోనే వరంగల్‌లో మెట్రో ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మహా మెట్రో ప్రతినిధులు గత డిసెంబర్లో వరంగల్ వచ్చి మెట్రో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేశారు.

కాజీపేట నుంచి పెట్రోల్‌ పంపు.. అక్కడి నుంచి పోచమ్మ మైదాన్‌ మీదుగా వెంకట్రామ టాకీస్‌ నుంచి వరంగల్‌ రైల్వే స్టేషన్‌ వరకు దాదాపు 15 కిలోమీటర్ల పొడవు మెట్రో మార్గాన్ని నిర్మించొచ్చని.. దీనికి రూ.1400 కోట్ల వరకు ఖర్చవుతుందని మహా మెట్రో ప్రతినిధులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరంగల్‌ నగర ట్రాఫిక్‌, రవాణా వ్యవస్థ, ప్రజల ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ.. కోటి రూపాయలతో మహా మెట్రో డీపీఆర్‌ను రూపొందిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.