యాప్నగరం

వర్షంలో స్ట్రెచర్ మీదే మహిళ మృతదేహం.. వరంగల్ ఎంజీఎంలో దారుణం

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్ ప్రాంగణంలో ఓ మహిళ మృతదేహం రెండు గంటలపాటు స్ట్రెచర్‌పైనే ఉంది. వర్షంలో తడుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు.

Samayam Telugu 20 Jul 2020, 8:43 pm
కరోనా వైరస్ కారణంగా సాటి మనిషి చనిపోయినా పట్టించుకోని పరిస్థితి తలెత్తింది. రోడ్డు మీద ఎవరైనా అచేతనంగా పడిపోయినా వారికి ఎక్కడ కరోనా ఉందేమోనన్న అనుమానంతో అటు వెళ్లడానికే జంకుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా కోవిడ్‌తో మరణించిన వారిని చూడటానికి భయపడుతున్నారు. హాస్పిటళ్లలో చికిత్స పొందుతూ మరణించిన కరోనా బాధితుల డెడ్ బాడీలను తీసుకెళ్లడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బందే అంత్యక్రియలు జరపాల్సి వస్తోంది.
Samayam Telugu నమూనా చిత్రం
Representative image


కరోనా ఉందో లేదో తెలియనప్పటికీ.. ఎవరైనా చనిపోతే డెడ్ బాడీని తాకడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మహిళ డెడ్ బాడీ రెండు గంటలపాటు స్ట్రెచర్ మీదే ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. మృతదేహం వర్షంలో తడుస్తున్నప్పటికీ.. అటు వైపు ఎవరూ వెళ్లలేదు.

రెండు గంటలు గడిచినా హాస్పిటల్ సిబ్బంది ఆ మృతదేహం గురించి పట్టించుకోలేదు. చివరకు పోలీసులు చొరవ తీసుకొని అది ఎవరి డెడ్ బాడీ అనే విషయాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడటంతో.. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి వారు అంగీకరించారు. ఇంతకూ ఆ మహిళ మరణించడానికి కరోనా కారణమా లేదంటే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయా అనేది తేలలేదు.

వరంగల్ ఎంజీఎంలో ఇటీవలే ఓ కరోనా అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. శాంపిళ్లు సేకరించి ఐదు రోజులు గడిచినా రిపోర్టు అందలేదు. దీంతో సరైన వైద్యం అందలేదనే ఆరోపణలొచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.