యాప్నగరం

ఏసీబీ వలలో ప్రిన్సిపాల్.. విద్యార్థిని నుంచి డబ్బు తీసుకుంటూ..

Warangal: వరంగల్ ఎంజీఎం నర్సింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్న ఓ ఏఎన్ఎం 2016 సంవత్సరంలో నర్సింగ్ ట్రైనింగ్‌లో జాయిన్ అయింది. ఆమె ఆ ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చి గత డిసెంబర్ 15 వరకు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆమెకు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వలేదని బాధితురాలు ఆరోపించింది.

Samayam Telugu 31 Jan 2020, 10:27 am
మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వరంగల్‌లోని ఎంజీఎం నర్సింగ్ స్కూల్, హాస్టల్‌ ప్రిన్సిపాల్‌, అతని కొలీగ్స్‌ను రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా వారు ఏసీబీ అధికారులకు చిక్కారు. అక్కడే ట్రైనింగ్‌లో ఉన్న ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్‌ను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Samayam Telugu MGM School of Nursing


Also Read: ఉడుకుతున్న మటన్ కూర గిన్నెలో పడ్డ బాలుడు

వరంగల్ ఎంజీఎం నర్సింగ్ స్కూల్‌లో శిక్షణ పొందుతున్న ఓ ఏఎన్ఎం 2016 సంవత్సరంలో నర్సింగ్ ట్రైనింగ్‌లో జాయిన్ అయింది. ఆమె ఆ ఇన్‌స్టిట్యూట్‌లోకి వచ్చి గత డిసెంబర్ 15 వరకు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఆమెకు రిలీవింగ్ ఆర్డర్ ఇవ్వలేదని బాధితురాలు ఆరోపించింది. తన రిలీవింగ్ ఆర్డర్ కోసం ప్రిన్సిపల్‌ని అడిగితే చాలా లీవ్‌లు వాడుకున్నారని, అందువల్ల ఆర్డర్ ఇవ్వడం కుదరదని చెప్పాడని బాధితురాలు వెల్లడించింది. రిలీవింగ్ లెటర్ ఇవ్వాలంటే రూ.60 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించింది.

Also Read: రేప్ చేస్తున్నప్పుడు మీరు చూశారా? సమత దోషుల తరపున సంచలన వ్యాఖ్యలు


దాంతో యువతి లంచం ఇవ్వడం ఇష్టం లేక అవినీతి నిరోధరకశాఖ అధికారులను ఆశ్రయించింది. ఈక్రమంలోనే గురువారం రూ.40 వేలు ట్యూటర్ శోభా రాణి, శారద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తమ ప్రిన్సిపల్ లంచం తీసుకోమని చెప్పగా తాము తీసుకున్నట్లు శోభ, శారద వెల్లడించారు.

Also Read: పాతబస్తీలో యువకుల గొడవ, పిడి గుద్దులతో హల్‌చల్.. వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.