యాప్నగరం

ఢిల్లీ అల్లర్లు: చార్మినార్ వద్ద మెరుపు నిరసన.. ఒక్కసారిగా అలజడి

CAA: ఢిల్లీ ఘటనకు నిరసనగా మక్కా మసీదు వద్ద పాతబస్తీకి చెందిన ముస్లిం యువకులు ఒక్కసారిగా నిరసన ర్యాలీ చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనల నిమిత్తం వచ్చినవారిలో కొంత మంది ఆందోళనకు దిగారు.

Samayam Telugu 29 Feb 2020, 12:38 am
శుక్రవారం (ఫిబ్రవరి 28) ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా హైదరాబాద్‌లోని మక్కా మసీదు వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రార్థనలకు వచ్చిన ముస్లింలలో కొంత మంది యువకులు ఢిల్లీ ఘటనను ఖండిస్తూ అకస్మాత్తుగా నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా గళమెత్తారు. యువకుల ఆందోళనతో చార్మినార్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఢిల్లీ ఆందోళన నేపథ్యంలో పాతబస్తీ సహా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముందస్తుగా భద్రతా బలగాలను మోహరించారు.
Samayam Telugu images


మరోవైపు.. ఢిల్లీలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సీఏఏ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో చెలరేగిన హింసలో 40 మందికి పైగా మరణించారు. అనధికారంగా ఈ మరణాలు 200 పైగా ఉండొచ్చని కొంత మంది జర్నలిస్టులు ట్వీట్ చేశారు. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతో దేశ రాజధాని అట్టుడికింది. అల్లరిమూకలు నిప్పు పెట్టడంతో ఇళ్లు, వ్యాపార సముదాయాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసు అధికారి అంకిత్ శర్మను చిత్రహింసలకు గురిచేసి చంపేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆయన శరీరంపై 400 కత్తి గాట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఈ ఘటన దేశవాసులను ఆందోళనకు గురిచేసింది.

Also Read: అనవసర భయాలతో చికెన్ తినడం మానేయొద్దు..

Must Read: పాక్ ముస్లింలకు హైదరాబాద్‌లో నివాసం కల్పిస్తారా.. రాజాసింగ్ ఫైర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.