యాప్నగరం

ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదు.. ప్రభుత్వంపై హైకోర్ట్ సీరియస్!

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనను ఎందుకు ఆపలేకపోయారని నిలదీసింది.

Samayam Telugu 18 Oct 2019, 3:09 pm
ఆర్టీసీ సమ్మెపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆర్టీసీకి ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సర్కారు బదులిస్తూ.. ఇప్పటికిప్పుడు ఎండీని నియమించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని తెలిపింది. సమర్థవంతమైన అధికారి ఇంఛార్జీగా ఉన్నారని వివరణ ఇచ్చింది. ప్రభుత్వ సమాధానంతో న్యాయమూర్తి సంతృప్తి చెందలేదు. సమర్థుడైన అధికారి ఇంఛార్జీగా ఉంటే.. ఆయన్నే ఎండీగా ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఆయన ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించింది.
Samayam Telugu high court


ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరన్న హైకోర్టు.. ఆర్టీసీ సమ్మెకు మరికొందరు మద్దతు తెలిపితే ఆందోళనలను ఎవరూ ఆపలేరని న్యాయస్థానం తెలిపింది. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలను ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించింది. రెండు వారాలుగా ఆందోళనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీసింది.

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన 44% స్పెషల్ ఫిట్‌మెంట్ ఇచ్చామని, తర్వాత 16 శాతం ఐఆర్ ఇచ్చామని.. మొత్తం కలిపితే 67 శాతం జీతాలను పెంచామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సమైక్య రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతం కోసం రూ.750 కోట్లు ఖర్చు పెడితే, తెలంగాణా ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు ఖర్చు పెట్టిందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక 2500 కొత్త బస్సులను కూడా కొనిచ్చిన విషయాన్ని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

Read Also: కేసీఆర్ హుజూర్‌నగర్ సభ రద్దు.. అసలు కారణమిదేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.