యాప్నగరం

KTR సీఎం కామెంట్స్: పార్టీ నేతలకు తొందరెందుకు? అసలు కారణం ఏంటంటే..!

Telangana CM: ఇప్పటికే కాబోయే సీఎం అంటూ బహిరంగ వేదికపైనే కేటీఆర్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన పద్మారావు.. కేటీఆర్ సీఎం అవగానే.. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందంటూ సంచలన ప్రకటన చేశారు.

Samayam Telugu 22 Jan 2021, 10:12 pm
తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు కచ్చితంగా జరుగుతుందనిపించేలా గత కొన్ని రోజులుగా ప్రచారం హోరెత్తుతుంది. పలువురు టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కేటీఆర్‌ సీఎం అయితే తప్పేంటని వాదిస్తున్నారు. పలువురు బహిరంగంగానే ఆ మాటలు అంటున్న సంగతి తెలిసిందే. ఇక గురువారం డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ అయితే, ఒకడుగు ముందుకేసి నేరుగా కాబోయే సీఎం కేటీఆర్‌కు శుభాకాంక్షలంటూ వ్యాఖ్యానించారు. ఇది చర్చనీయాంశమైంది.
Samayam Telugu కేటీఆర్ (ఫైల్ ఫోటో)
KTR


అయితే, తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ఈ ఊహాగానాలకు మరింత వేడెక్కించే విషయాలను బయటపెట్టారు. ఇప్పటికే కాబోయే సీఎం అంటూ బహిరంగ వేదికపైనే కేటీఆర్‌కు కంగ్రాట్స్‌ చెప్పిన పద్మారావు.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి.. త్వరలోనే పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ ప్రకటించారు. కేటీఆర్ సీఎం అవగానే.. కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ జరుగుతుందంటూ సంచలన ప్రకటన చేశారు.

టీఆర్ఎస్ నేతల నుంచి తాజా వ్యాఖ్యలు చూస్తుంటే సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం నిజమేనా అనే అనుమానం కలుగుతోంది. దీనికి బలం చేకూర్చేలా వచ్చే నెలలోనే కేటీఆర్ బాధ్యతలు చేపట్టే ముహూర్తం ఖరారయ్యిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేబినెట్‌ను ప్రక్షాళన చేయబోతున్నారా? అనే అంశాలపై ఎవరికి వారే విశ్లేషించుకుంటున్నారు.

ఎందుకీ తొందరపాటు వ్యాఖ్యలు?
అయితే, టీఆర్ఎస్ నేతలు ఇలా తొందరపాటు వ్యాఖ్యలు చేస్తుండడానికి పలు కారణాలు కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు ఒకవేళ వచ్చే నెలలో కేటీఆర్ సీఎం అయ్యే అవకాశం లేకపోయినా.. ఆ తర్వాతైనా సీఎం పదవి ఆయనకే దక్కుతుంది. ఆ క్రమంలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేస్తారు. అయితే, అందులో చోటు కోసమే ఆశావహులు కేటీఆర్‌ను ప్రసన్నం చేసి ఆయన మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం మంత్రులుగా ఉన్నవారు కూడా తమ స్థానాలను పదిలం చేసుకొనేందుకు ‘కేటీఆర్ సీఎం’ అనే అంశంపై మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రులు తలసాని, ఈటల, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ తదితరులు ‘కేటీఆర్ సీఎం’ అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.