యాప్నగరం

విద్యార్థిని రోడ్డుపై ఈడ్చుకెళ్లి చావబాదిన దంపతులు.. సనత్‌నగర్‌‌లో దారుణం

Sanath Nagar: ఆ బాలుడు స్కూలుకు వెళ్తుండగా రోడ్డుపై అల్లరి చేస్తూ తమ పిల్లలపై చేయి చేసుకున్నారని దంపతులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ దాడిపై పౌర హక్కుల సంఘం కూడా స్పందించింది.

Samayam Telugu 19 Feb 2020, 1:13 pm
హైదరాబాద్‌లోని సనత్ నగర్‌లో దారుణం జరిగింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఇద్దరు దంపతులు రోడ్డుపై చావబాదారు. స్కూలు బ్యాగు వేసుకొని పాఠశాలకు వెళ్తుండగా దంపతులు బాలుడ్ని కొట్టిన చిత్రాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. దెబ్బలను తట్టుకోలేని బాలుడు కొట్టవద్దని బతిమిలాడాడు. అయినా కనికరం లేకుండా విద్యార్థిని రోడ్డుపై ఈడ్చుకొని వెళ్లి కొడుతుండడంతో బాలుడు వారి కాళ్లు పట్టుకున్నాడు. ప్రభుత్వ స్కూలు విద్యార్థిని కొడుతుండడం గమనించిన స్థానికులు సనత్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, దంపతులను అదుపులోకి తీసుకున్నారు.
Samayam Telugu Capture


అయితే, ఆ బాలుడు స్కూలుకు వెళ్తుండగా రోడ్డుపై అల్లరి చేస్తూ తమ పిల్లలపై చేయి చేసుకున్నారని దంపతులు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ దాడిపై పౌర హక్కుల సంఘం కూడా స్పందించింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నిజంగా ఇబ్బంది కలిగించి ఉంటే, నచ్చ చెప్పాల్సింది పోయి.. విచ్చల విడిగా కొట్టడం తప్పని పోలీసులు వెల్లడించారు.

Also Read: అలా అయితే మేం జాతీయ పార్టీ పెడతాం.. కేటీఆర్, పీయుశ్ గోయల్ మధ్య సరదా చర్చ

ప్రస్తుతం బాలుడిపై దాడికి పాల్పడ్డ భార్యాభర్తలను పోలీసులు తమ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారిని అంతలా ఎందుకు కొట్టాల్సి వచ్చిందనే అంశంపై విచారణ జరుపుతున్నారు.

Also Read: రతన్ టాటా ట్వీట్‌కు కేటీఆర్ స్పందన.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

Must Read: శాటిలైట్ రైల్వేస్టేషన్‌కు శంకుస్థాపన.. సభలో తలసానికి రైల్వే మంత్రి గట్టి కౌంటర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.