యాప్నగరం

గాలి బీభత్సానికి కూలిన టోల్‌గేట్ భారీ షెడ్డు.. భార్యాభర్తలు మృతి

Mahabubnagar: అదే ప్రాంతంలో వారు తమ వ్యవసాయ పంటను రోడ్డుపై ఎండకు ఆర బెట్టారు. గాలి విపరీతంగా రావడంతో మున్ననూర్ టోల్ ప్లాజా దగ్గర ఉన్న రేకుల షెడ్డు గాలిలో లేచి ఈ రైతులపై పడింది. దీంతో ఇద్దరు భార్యాభర్తల మృతి చెందారు.

Samayam Telugu 16 May 2020, 7:36 pm
మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శనివారం సాయంత్రం విపరీతంగా వచ్చిన గాలి దుమారం ధాటికి ఇద్దరు రైతులు మరణించారు. జిల్లాలోని మిడ్జిల్ మండల పరిధిలోని మున్ననూర్ టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారి 167 సమీపంలో గాలి దుమారంతో రేకుల షెడ్డు కూలిపోయింది. దీంతో అక్కడే భార్యభర్తలు ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారు మున్ననూర్ గ్రామస్థులుగా గుర్తించారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Samayam Telugu కూలిన టోల్ ప్లాజా షెడ్డు


సాయంకాలం సుమారు మూడు గంటల ఈ ప్రాంతంలో నల్లటి మబ్బులు కమ్ముకొని విపరీతమైన ఈదురు గాలులు రావడంతో రహదారి పై నిర్మిస్తున్న టోల్ గేట్ షెడ్ కూలింది. అక్కడికి సమీపంలోనే తమ పంట ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న భార్యా భర్తలపై ఆ షెడ్డు ఒక్కసారిగా పడింది. ధాన్యం రాశుల్లోనే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

Also Read: undefined

నాణ్యతలేని పనుల వల్ల గాలి దుమారానికి రేకుల షెడ్డు లేచిపోయిందని స్థానికులు చెబుతున్నారు. మరణించిన భార్యా భర్తలను కృష్ణయ్య, పుష్పగా గుర్తించారు. స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

Also Read: మాంసం దుకాణాలకు సర్కారు కొత్త రూల్స్.. కచ్చితంగా పాటించాల్సిందేMust Read:కొంపముంచిన బర్త్ డే పార్టీ.. హైదరాబాద్ అపార్ట్‌మెంట్‌లో 23 మందికి కరోనా

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.