యాప్నగరం

వాగులో చిక్కుకున్న దంపతులు.. కాపాడాలని సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేసిన ఎమ్మెల్యే

Nagar Kurnool: స్థానికుల ద్వారా వీరి సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేశారు.

Samayam Telugu 16 Sep 2020, 11:10 pm
నాగర్ కర్నూల్‌ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. సభావత్, వెంకట్ రాములు అనే దంపతులు డిండి వాగులో చిక్కుకున్నారు. అయితే, స్థానికుల ద్వారా వీరి సమాచారం తెలుసుకున్న ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సాయం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫోన్ చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Dindi


ముఖ్యమంత్రి, సీఎస్‌లతో మాట్లాడి ప్రవాహంలో చిక్కుకుపోయిన దంపతులను రక్షించడానికి బాలరాజు హెలికాప్టర్‌ను కోరారు. బుధవారం రాత్రికి కూడా దంపతులు డిండి వాగులోనే చిక్కుకొని ఉండగా.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నత అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. బుధవారం రాత్రికల్లా రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకొని వారిని రక్షించే అవకాశముంది.

Must Watch: వీడియో: భర్తను కిందపడేసి చెప్పులతో కొట్టిన భార్య.. నడిరోడ్డుపై జనంముందే..

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.