యాప్నగరం

చేపల కూర తిని ఒకరు మృతి.. మరొకరి పరిస్థితి విషమం

రాత్రి చేపలు తెచ్చుకొని కూర వండుకొని తిన్నారు. అయితే అర్థరాత్రి ఇద్దరూ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు.

Samayam Telugu 19 Sep 2020, 11:02 am
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. చేపల కూర తిన్న ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భార్య భర్తలు చేపలు తెచ్చుకొని వండుకొని తిన్నారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. మోత్కురుకు చెందిన బుర్ర పుష్ప (35), బుర్ర జాహంగీర్‌ దంపతులు రాత్రి చేపల కూర వండుకొని తిన్నారు. అయితే తిన్నప్పుడు బాగానే ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు .
Samayam Telugu ఫిష్ కర్రీ (ఫైల్ ఫోటో)
fish curry


Read More: ఒకే ప్లాట్ ఇద్దరికి రిజిస్ట్రేషన్.. ఐదుగురిపై కేసు నమోదు

భార్యభర్తలిద్దరూ తీవ్ర కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయి. కుటుంబీకులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో పుష్ప మృతి చెందింది. జాహంగీర్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చేపల కూర తిని ఇలా జరగడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.