యాప్నగరం

కరోనాతో భర్త మృతి... బిల్డింగ్‌పై నుంచి దూకిన భార్య

భర్తకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నాడు. పరిస్థితి విషమించడంతో ఇంట్లోనే మృతిచెందాడు. దీంతో భార్య అతని మృతిని తట్టుకోలేకపోయింది.

Samayam Telugu 23 Oct 2020, 9:15 am
కరోనా అనేకమంది ప్రాణాల్ని బలితీసుకుంటోంది. వైరస్‌తో కొందరు చనిపోతుంటే.. తమకు ఎక్కడ కరోనా వస్తుందోనన్న భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమవారు కరోనాతో చనిపోతుంటే.. ఆ బాధను తట్టుకోలేక మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది.
Samayam Telugu భార్య ఆత్మహత్య
wife end her life


Read More: రోడ్డుపై నెలన్నర పసికందు.. కొత్తబట్టలు వేసి పేరు పెట్టిన పోలీసులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేష్‌(60), ధనలక్ష్మి(55) దంపతులు సైనిక్‌పురి అంబేద్కర్‌ నగర్‌లో నివాసముంటున్నారు. వెంకటేష్‌ ఏఎస్‌రావు నగర్‌లోని ఉషోదయ సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తున్నాడు. వెంకటేష్‌కు కరోనా వచ్చింది. దీంతో కొన్ని రోజులుగా హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నాడు. అయితే పరిస్థితి విషమించి గురువారం ఇంట్లోనే మృతి చెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ధనలక్ష్మి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే వీరికి పిల్లలు లేకపోవడంతో.. మృతదేహాలను ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.