యాప్నగరం

తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తాం: బీజేపీ లక్ష్మణ్

Telangana BJP అధ్యక్షుడు కె లక్ష్మణ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలోనూ బీజేపీతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.

Samayam Telugu 27 Jan 2020, 7:53 pm
తెలంగాణలోనూ జనసేనతో కలిసి పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ తెలిపారు. త్వరలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అవుతామని వెల్లడించారు. ఈ అంశంపై పవన్‌తో ఇప్పటికే ఫోన్‌లో మాట్లాడామని తెలిపారు. మున్సిపాలిటీల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో సోమవారం (జనవరి 27) ఆయన మీడియాతో మాట్లాడారు. మెజార్టీ లేకపోయినా దొడ్డి దారిలో టీఆర్‌ఎస్ ఛైర్మన్ పదవులను దక్కించుకుందని మండిపడ్డారు.
Samayam Telugu Pawan


మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనైతిక చర్యలకు పాల్పడిందని లక్ష్మణ్‌ ధ్వజమెత్తారు. బీజేపీ గెలిచిన తుక్కుగూడ మున్సిపాలిటీలో ప్రజా తీర్పును వమ్ము చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 సీట్లు గెలిచినా ఆ పార్టీకి అధికార దాహం తీరలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలిచిన ఒక్క మున్సిపాలిటీని కూడా ఇలా చేయడం సరికాదన్నారు. తుక్కుగూడ ఎన్నికపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశంలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు పవన్‌ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లోనూ పవన్‌ సేవలు ఉపయోగించుకుంటామని తెలిపారు. జనసేన - బీజేపీ కలిసి పనిచేసి రాష్ట్రంలో కేసీఆర్‌ అవినీతి, కుటుంబ పాలనను దించుతామని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో కలిసి పనిచేయడానికి అవగాహన కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Also Read: బ్రహ్మంగారు చెప్పిన వింతలు ఇవేనేమో: కేటీఆర్

Must Read: సరిలేరు నీకెవ్వరా.. దంచి కొడితేనే దారిలోకి వస్తారు, మీడియాపై రేవంత్ ఫైర్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.