యాప్నగరం

హరీశ్ రావుతో ఘర్షణ ఉండదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Harish Rao, టీఆర్‌ఎస్‌తో ఇకపై ఎలాంటి ఘర్షణ ఉండదని సంగారెడ్డి ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో 14 ఏళ్ల నాటి వైరానికి ముగింపు పడుతుందా?

Samayam Telugu 20 Sep 2019, 5:39 pm
ర్థిక మంత్రి హరీశ్ రావుతో ఇకపై తనకు ఎలాంటి ఘర్షణ ఉండదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని తెలిపారు. శుక్రవారం (సెప్టెంబర్ 20) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు రెండోసారి కూడా పట్టం కట్టారని.. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ప్రజలు పట్టించుకోరని జగ్గారెడ్డి అన్నారు.
Samayam Telugu jagga reddy


మున్సిపల్ ఎన్నికల్లో ఎవరి ప్రచారం వారిదే అని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో హరీశ్ రావుతో ప్రచారం చేసుకున్నా అభ్యంతరం లేదని తెలిపారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకే గురువారం మంత్రి హరీశ్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయినట్లు చెప్పారు.

Also Read: ఢిల్లీలో కిషన్ రెడ్డి ‘హోం లెస్’ మినిస్టర్‌.. మంత్రి గారికి ఇంటి కష్టాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జగ్గారెడ్డి అనుచరులు, టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జగ్గారెడ్డి, హరీశ్ రావు మధ్య తీవ్రమైన మాటల యుద్ధం చోటు చేసుకుంది. రాజకీయ వైరంతో ఈ ఇరువురు నేతలూ ఏళ్ల తరబడి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు. ఇలాంటి నేతలు 14 ఏళ్ల తర్వాత కలవడం చర్చనీయాంశంగా మారింది.

జగ్గారెడ్డి 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాతి జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సంగారెడ్డి తూర్పు నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.