యాప్నగరం

కరోనా సాకుతో కన్న తల్లిని గెంటేసి.. కరీంనగర్‌లో దారుణం

Karimnagar: కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో కొంత కాలం క్రితం ఓ వృద్ధురాలు షోలాపూర్ వెళ్లింది. తిరిగి కొడుకుల ఇంటికి వచ్చింది. అయితే, తల్లికి కరోనా సోకిందని కొడుకులు ఆమెను కనీసం ఇంట్లోకి రానివ్వలేదు. బయటే ఉండిపోవాలని తేల్చి చెప్పేశారు.

Samayam Telugu 29 May 2020, 4:47 pm
కరీంనగర్ జిల్లాలో మానవత్వానికి మచ్చ తెచ్చే ఘటన జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి సాకుతో కన్న తల్లిని వదిలించుకోవాలని కొడుకులు ప్రయత్నించారు. వయసు పైబడిన ఆ పెద్దావిడను కనికరం లేకుండా కాదు పొమ్మన్నారు. మిట్ట మధ్యాహ్నం వేళ ఎర్రటి ఎండలో నిలబెట్టి పైశాచికత్వాన్ని చాటారు. తల్లిని బయటికి పంపడం పట్ల ఇరుపొరుగు ప్రశ్నించినా, తిట్టినా, చివరికీ చీదరించుకున్నా ఆ కొడుకులు వినలేదు. కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Karimnagar


కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌లో కొంత కాలం క్రితం ఓ వృద్ధురాలు షోలాపూర్ వెళ్లింది. తిరిగి కొడుకుల ఇంటికి వచ్చింది. అయితే, తల్లికి కరోనా సోకిందని కొడుకులు ఆమెను కనీసం ఇంట్లోకి రానివ్వలేదు. బయటే ఉండిపోవాలని తేల్చి చెప్పేశారు. కొడుకులు ఇంట్లోకి రానివ్వకపోవడంతో చేసేది లేక తల్లి శ్యామల ఎర్రటి ఎండలో రోడ్డు పైనే కూర్చుండిపోయింది. స్థానిక కార్పొరేటర్ అశోక్ ఈ విషయం తెలుసుకొని, అక్కడికి చేరుకొని కొడుకులను మందలించారు. దీంతో పెద్ద కొడుకు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు.

Also Read: undefined

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.