యాప్నగరం

‘పది విద్యార్థులనూ ప్రమోట్ చేయాలి.. లేకుంటే..’

lockdown in telangana: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం నుంచి పరీక్షల్లో పాసవడం కష్టమని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు పాఠశాలల వారు ఆన్లైన్ పాఠాల ద్వారా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయగలరని అన్నారు.

Samayam Telugu 6 May 2020, 4:03 pm
లాక్‌ డౌన్‌ వేళ 9 తరగతి వరకూ విద్యార్థులకు పై తరగతికి వెళ్లేందుకు అనుమతించినట్లే పదో తరగతి విద్యార్థును కూడా ప్రమోట్‌ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌ చేసింది. ఇప్పటికే నిర్వహించిన ప్రీ ఫైనల్‌ పరీక్షల ఆధారంగా వారికి ఆ అవకాశం ఇవ్వాలని సూచించింది. ఇప్పటికే పరీక్షల నిర్వహణలో చాలా విరామం వచ్చినందున లాడ్‌ డౌన్‌లో పరీక్షలు నిర్వహిస్తే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎలాగైనా నెట్టుకు రాగలరని.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం


ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం నుంచి పరీక్షల్లో పాసవడం కష్టమని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివే పిల్లలకు పాఠశాలల వారు ఆన్లైన్ పాఠాల ద్వారా విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయగలరని అన్నారు. కానీ, పేద పిల్లల విషయంలో వారికి ఇలాంటి అవకాశాలు ఉండబోవని చెప్పారు. ఇంట్లో పెద్దలు చదువుచెప్పే పరిస్థితి కూడా ఉండదని వివరించారు. చివరికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు అనుత్తీర్ణులైతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు.

మగ పిల్లలు బాలకార్మికులుగా, ఆడపిల్లలు బాల్యవివాహంతో చదువుకు స్వస్తిచెప్పే పరిస్థితి వస్తుందని అచ్యుతరావు పేర్కొన్నారు. కరోనా ఇంకా తీవ్రంగా ఉన్నందున పరీక్షల పేరుతో పిల్లలు బయటకు వస్తే ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అందరికీ సోకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఇది పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదన్నారు. అందువల్ల అర్ధ సంవత్సర, ప్రీ ఫైనల్‌ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా పిల్లలను ప్రమోట్‌ చేసేలా రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని బాలల హక్కుల సంఘం తరపున రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్‌ దాఖలు చేశామని ఆయన చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.