యాప్నగరం

భర్తపై యాసిడ్‌తో దాడి చేసిన భార్య.. సూర్యాపేటలో దారుణం

సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. భర్తపై యాసిడ్‌తో దాడి చేసింది. అయితే ఆమె మానసిక పరిస్థితి బాగోలేదని స్థానికులు చెబుతున్నారు.

Samayam Telugu 1 Dec 2020, 3:17 pm
భర్త ముఖంపై భార్య యాసిడ్‌తో దాడి చేసిన షాకింగ్ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాట పట్టణంలోని శ్రీనివాసనగర్‌కి చెందిన నర్సింహారావు(50), లక్ష్మి భార్యాభర్తలు. కొడుకులకు వివాహాలు జరిపించేసి అందరితో కలసి ఉంటున్నారు. అయితే ఇటీవల భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతున్నాయి. భర్త తన పద్ధతి మార్చుకోవడం లేదంటూ అసహనానికి గురైన భార్య దారుణానికి ఒడిగట్టింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
acid attack


Read Also:పెళ్లై నెలరోజులైనా కుదరని సఖ్యత.. నవవధువు.!

ఈ రోజు ఉదయం భర్త నర్సింహారావుపై యాసిడ్‌తో దాడి చేసింది. ముఖంపై యాసిడ్ పడడంతో కళ్లలో మంటలతో నర్సింహారావు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన్ను వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కొద్దికాలంగా భార్య లక్ష్మి మానసిక స్థితి సరిగ్గా లేదని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: ఫోన్ ఎత్తని భర్త.. నోరుజారి దొరికిపోయిన భార్య, శ్రీకాకుళంలో దారుణం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.