యాప్నగరం

శంషాబాద్‌లో మరో దారుణం.. మహిళను చంపి తగులబెట్టిన దుండగులు

Shamshabad పోలీస్ స్టేషన్ పరిధిలో మరో దారుణం జరిగింది. 35 ఏళ్ల ఓ మహిళను హత్య చేసి పెట్రోలు పోసి తగులబెట్టారు. అత్యాచారం చేసి హత్య చేసినట్లు భావిస్తున్నారు.

Samayam Telugu 30 Nov 2019, 4:12 pm
వెటర్నరీ డాక్టర్ హత్య ఘటనపై ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతుండగానే శంషాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని తగులబెట్టారు. మహిళ వయసు 35 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. శంషాబాద్ సమీపంలోని సిద్ధులగుట్ట వద్ద శుక్రవారం (నవంబర్ 29) రాత్రి 9 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.
Samayam Telugu murder2
శంషాబాద్‌లో మరో దారుణం


మంటల్లో మహిళ మృతదేహం తగలబడుతున్న దృశ్యాలను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి సమీపంలో జరుగుతున్న షూటింగ్ చూడటానికి వచ్చిన యువకులు పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలికి వచ్చి పరిశీలించారు. మహిళ డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

Also Read: వీడిన వెటర్నరీ డాక్టర్ మర్డర్ మిస్టరీ

బాధితురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైద్యురాలి హత్య జరిగిన ప్రదేశానికి కిలోమీటర్ దూరంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. 24 గంటల వ్యవధిలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురవడం కలకలం రేపుతోంది.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ మహిళ ఎవరు? ఆ హత్య ఎవరు చేశారనే కోణంలో విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.