యాప్నగరం

భూతగాదాలతో సెల్ టవర్ ఎక్కిన మహిళ

భూ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్ టవర్ ఎక్కి బెదిరించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని కడపర్తి గ్రామంలో చోటు చేసుకుంది.

Samayam Telugu 31 Aug 2019, 11:07 am
భూ వివాదాన్ని పరిష్కరించాలంటూ ఓ మహిళ సెల్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసింది. తనకు న్యాయం చేయకపోతే పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలంలోని కడపర్తి గ్రామంలో చోటుచేసుకుంది.
Samayam Telugu Woman


స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి యాతాకుల సోమయ్య అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు పిల్లలు లేకపోవడంతో అంజమ్మ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఎనిమిదేళ్ల క్రితం సోమయ్య మరణించాడు. చనిపోవడానికి ముందే సోమయ్య తనకున్న రెండెకరాల భూమిని ఇద్దరి భార్యలకు సమానంగా పంచాడు.
Read Also: రోగిని భుజాలపై మోస్తూ రోడ్డు దాటించిన పోలీస్.. నెటిజన్లు ఫిదా, వీడియో వైరల్undefined
దీంతో ఈ ఏడాది అంజమ్మ తన పొలంతో పాటు పక్కనే ఉన్న మొదటి భార్య పొలాన్ని కూడా దున్నింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం ఎంతకి పరిష్కారం కాకపోవడంతో అంజమ్మ శనివారం ఉదయం సెల్‌ టవర్‌ ఎక్కింది. తనకు న్యాయం చేసే వరకు కిందకి దిగనని భీష్మించుకు కూర్చుంది.

దీంతో గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని అంజమ్మను కిందికు దింపేందుకు ప్రయత్నించారు. సమస్యను పరిష్కరిస్తామని, కిందికి దిగిరావాలని కోరారు. అయినప్పటికీ ఆమె వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అంజమ్మను సురక్షితంగా కిందకి దించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.