యాప్నగరం

హైదరాబాద్‌లో విషాదం.. చిన్నారితో సహా మహిళ ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. భర్తతో గొడవ పడిన ఓ వివాహిత ఏడాది వయసున్న కుమార్తెతో సహా భవంతి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

Samayam Telugu 10 Aug 2020, 4:22 pm
హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ ఏడాది వయసున్న కూతురితోపాటు ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మేరి మార్టెన్ అనే వివాహిత భర్తతో గొడవ పడింది. క్షణికావేశంలో నాలుగో అంతస్తు నుంచి దూకింది. తను చనిపోతే కుమార్తె భవిష్యత్తు ఏంటనే ఆందోళనతో పాపతో సహా దూకేసింది. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu మృతి చెందిన పాప, తల్లి


సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.