మలక్పేట్: భవనంలో అద్దెకుండే వారికి కరోనా.. భయంతో మహిళ ఆత్మహత్య
Malakpet: స్థానికులు గుర్తించి ఆమెను వెంటనే ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో విజయ చికిత్స పొందుతూ చనిపోయింది.
Samayam Telugu 28 Aug 2020, 4:27 pm
మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. కరోనా వైరస్ ఎక్కడ సోకుతుందో అన్న భయంతో ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మలక్ పేటలోని శాలివాహన నగర్లో జరిగింది. హైదరాబాద్లోని మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలివాహన నగర్లో విజయ అనే మహిళ నివాసం ఉంటుంది. అయితే తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు కరోనా వైరస్ బారిన పడ్డారు.
దాంతో తనకు కూడా కరోనా సోకుతుందేమో అన్న భయంతో 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఆరాధన విజయ అనే మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి ఆమెను వెంటనే ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో విజయ చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉస్మానియా ఆస్పత్రిలోని శవాగారానికి మృతదేహాన్ని తరలించారు.
Also Read: undefined
Also Read: undefined
దాంతో తనకు కూడా కరోనా సోకుతుందేమో అన్న భయంతో 50 సంవత్సరాల వయస్సు ఉన్న ఆరాధన విజయ అనే మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గుర్తించి ఆమెను వెంటనే ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో విజయ చికిత్స పొందుతూ చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉస్మానియా ఆస్పత్రిలోని శవాగారానికి మృతదేహాన్ని తరలించారు.
Also Read: undefined
Also Read: undefined