యాప్నగరం

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధిస్తున్నారు.. HRCలో మహిళ ఫిర్యాదు

Hyderabad: గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఆమె వచ్చి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే భాస్కర్‌ రావు అక్రమాలకు అడ్డొచ్చినందుకు తన భర్త, కుమారుడిని ఆయన భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మహిళ ఆరోపించారు.

Samayam Telugu 25 Sep 2020, 7:58 am
నల్గొండ జిల్లా మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే భాస్కర్‌రావుపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తన కుటుంబంపై ఆ ఎమ్మెల్యే అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించింది. భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతూ.. ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించింది. తన భర్త న్యాయవాది అని, ఎమ్మెల్యే బాధితుల కేసులు వాదిస్తుంటారని వివరించింది. ఈ క్రమంలోనే వారి కేసులు వాదిస్తున్నందుకు కక్షగట్టారని వాపోయారు.
Samayam Telugu హెచ్ఆర్సీ (ఫైల్ ఫోటో)
HRC


గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఆమె వచ్చి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే భాస్కర్‌ రావు అక్రమాలకు అడ్డొచ్చినందుకు తన భర్త, కుమారుడిని ఆయన భయబ్రాంతులకు గురిచేస్తున్నారని మహిళ ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.