యాప్నగరం

మధిర: రైల్లో ప్రసవం.. తల్లీ బిడ్డా క్షేమం

నెలలు నిండిన ఓ గర్భిని రైల్లో ప్రసవించింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తోటి ప్రయాణికులు ఆమెకు సాయం అందించారు. గౌతమీ రైల్లో మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Samayam Telugu 21 Oct 2019, 7:41 pm
గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఒక మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మధిర రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆదివారం (అక్టోబర్ 20) ఈ ఘటన చోటు చేసుకుంది. షాజాన్‌ బీ అనే నెలలు నిండిన గర్భిణి ఆదివారం సికింద్రాబాద్‌ నుంచి బీహార్‌కు గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో బయలుదేరింది. మధిర రైల్వే స్టేషన్‌ సమీపంలోకి రాగానే ఆమెకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె రైల్లోనే ప్రసవించింది. రైల్లో ప్రయాణిస్తున్న తోటి మహిళలకు ఆమెకు సాయం అందించారు.
Samayam Telugu birth


Also Read: లిఫ్టులో ఇరుక్కొని 8 ఏళ్ల బాలిక మృతి.. ఎల్‌బీ నగర్‌లో విషాదం

రైలు మధిర రైల్వే స్టేషన్‌‌కు సమీపిస్తుండగా.. ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో స్టేషన్‌ సూపరింటెండెంట్‌ కాశిరెడ్డి.. 108 అంబులెన్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రైలు మధిర స్టేషన్ చేరుకోగానే 108 వాహనంలో ఆ తల్లీబిడ్డను మధిర సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Rail Image Credit: Ramesh R/ www.pexels.com

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.