యాప్నగరం

Hyd వరదలో కొట్టుకొచ్చిన మహిళ కాలు.. నరికేసిన స్థితిలో రోడ్డుపై.. స్థానికుల్లో భయం

Hyderabad Floods: స్థానికులు సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని చుట్టుపక్కల పరిశీలన చేశారు. ఎంత వెతికినా కూడా ఎలాంటి మృత దేహం కనిపించలేదు.

Samayam Telugu 19 Sep 2020, 6:49 pm
హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడుతున్న వేళ వరద నీరు ప్రవహిస్తున్న నాలాలో ఓ మహిళకు సంబంధించిన కాలు కొట్టుకురావడం కలకలం రేపుతోంది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. హైదరాబాదులోని చంపాపేట్ రెడ్డి బస్తీలో ఈ పరిణామం జరిగింది. స్థానికంగా ఉన్న నాలాలో ఒక మహిళ కాలు కొట్టుకొచ్చింది. అది తొలుత స్థానికులు గమనించి ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇది ఎవరిది అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ చుట్టుపక్కల మృత దేహం కనిపిస్తుందేమో అని చూశారు. నాలాలో కొట్టుకొచ్చిన కాలును నరికి దేహం నుంచి వేరు చేసినట్లు ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Samayam Telugu కాలును సంచిలోకి ఎత్తుతున్న సిబ్బంది
woman leg found in hyderabad


స్థానికులు సైదాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని చుట్టుపక్కల పరిశీలన చేశారు. ఎంత వెతికినా కూడా ఎలాంటి మృత దేహం కనిపించలేదు. ఘటన స్థలంలో పోలీసులు కాలును ఓ సంచిలో వేసి, స్వాధీనం చేసుకున్నారు. దాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రిలోని శవాగారానికి తరలించారు.

Also Read: కోడి ముదిరింది.. కల్లు పులిసింది.. అయినా ఇళ్లు రాలే..

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఆ మహిళ ఎవరు? నాలాలో మహిళ కాలు ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు హత్య చేసి ఉంటారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, ఈ విషయం తెలుసుకున్న హెచ్‌ఆర్సీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక, నేరేడ్ మెట్ నాలాలో పడి బాలిక చనిపోయిన వ్యవహారంలో కూడా హెచ్ఆర్సీ జీహెచ్ఎంసీ సిబ్బందికి నోటీసులు జారీ చేసింది.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.