యాప్నగరం

నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన భార్య.. ఇల్లెందులో దారుణం

Yellandu పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న భర్తను భార్య దారుణంగా చంపేసింది. నిద్రిస్తుండగా పెట్రోలు పోసి నిప్పంటించింది.

Samayam Telugu 13 Mar 2020, 12:01 am
నిద్రిస్తున్న భర్తపై భార్య పెట్రోలు పోసి నిప్పంటించి చంపేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను దారుణంగా కడతేర్చడం గమనార్హం. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లెందు పట్టణంలోని వినోబా కాలనీకి చెందిన నక్కా కళ్యాణ్‌ (28) కొన్నేళ్ల కిందట ఇల్లెందు మండలం నిజాంపేటకు చెందిన శైలజను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉన్నా.. కొంత కాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Samayam Telugu suicide


పెద్ద మనుషులు పలుమార్లు పంచాయతీ నిర్వహించి ఇద్దరికీ నచ్చజెప్పిన భార్యాభర్తల మధ్య ఘర్షణ సమసిపోలేదు. దీంతో శైలజ కఠిన నిర్ణయం తీసుకుంది. తన భర్త కళ్యాణ్‌ను కడతేర్చాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బుధవారం (మార్చి 10) అర్ధరాత్రి 2 గంటలకు పథకం ప్రకారం.. నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది.

మంటలకు తాలలేక కళ్యాణ్ కేకలు పెట్టుకుంటూ ఇంటి బయటకు పరుగులు పెట్టాడు. శైలజ కూడా అరుస్తూ కేకలు వేసింది. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పేశారు. కానీ, అప్పటికే అతడు తీవ్రంగా కాలిపోయాడు. బాధితుడిని వెంటనే ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం వేకువజామున అక్కడ నుంచి ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 8 గంటల సమయంలో మృతి చెందాడు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శైలజను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కళ్యాణ్‌, శైలజ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also Read: ఫంక్షన్ పేరుతో హోటల్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు: అబిడ్స్ యువతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.