యాప్నగరం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. సొంత పార్టీ మహిళా నేత ఫిర్యాదు

క్యాంపు కార్యాలయానికి వెళ్తే తమపై అవహేళనగా మాట్లాడుతున్నారని మహిళా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. భర్తతో కలిసి ఆమె మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది.

Samayam Telugu 13 Apr 2021, 12:41 pm
తెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై స్వయాన ఓ మహిళా సర్పంచ్ ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణ హాని ఉందంటూ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిపై అదే పార్టీకి చెందిన రూప్‌రెడ్డి పల్లె గ్రామ సర్పంచ్ బండారు కవిత, భర్త దేవెందర్ ఫిర్యాదు చేశారు. అభివృద్ది నిధులు అడిగినందుకు తమపై కక్ష పెంచుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కోన్నారు.
Samayam Telugu గండ్ర వెంకట రమణ రెడ్డి


గ్రామ అభివృద్ది నిధులు అడిగేందుకు క్యాంపు కార్యాలయానికి వెళ్లిన తమని అవహేళన చేస్తూ..బెదిరింపులకు పాల్పడ్డడని ఫిర్యాధులో మహిళా సర్పంచ్ పేర్కోన్నారు. మరోవైపు గ్రామానికి నిధులు కేటాయించను ఏం చేసుకుంటావో చేసుకో అని హెచ్చరించాడని అన్నారు. కుల సంఘాల్లో తిరుగుతున్నావంటూ తిట్టారని ఆమె తెలిపారు. దీంతో తమకు ఆయన నుండి ప్రాణభయం ఉందంటూ ఫిర్యాదులో పేర్కోన్నారు.

కాగా జరిగిన సంఘటన పై స్థానిక బీసీ సంఘాల నాయకులు గండ్ర వర్గం మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. కాగా 2018 ఎన్నికల్లో గండ్ర కాంగ్రెస్ నుండి గెలుపొంది. అనంతరం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.