యాప్నగరం

అసదుద్దీన్‌కు నిరసన సెగ.. ప్రచారం నుంచి వెళ్లిపోయిన ఎంపీ

ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో వచ్చిన వరదలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో ఇప్పుడు ఎన్నికల వేళ తమ ప్రాంతాలకు వస్తున్న వారిని జనం నిలదీస్తున్నారు.

Samayam Telugu 23 Nov 2020, 12:53 pm
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సైతం గ్రేటర్‌లో నిరసన సెగ తాకింది. జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ పర్యటిస్తున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఒవైసీ. ఈ సందర్భంగా జాంబాగ్ డివిజన్‌లో ఎంఐఎం అభ్యర్థి రవీందర్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.
Samayam Telugu mp asad


Read More: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంట తీవ్ర విషాదం

అయితే, తాము కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని ఓవైసీని స్థానిక మహిళలు నిలదీశారు. దీంతో.. వారికి సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు ఎంఐఎం చీఫ్. కాగా, హైదరాబాద్‌ను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా పాతబస్తీలో అనేక కాలనీల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ప్రకృతి విలయంతో అనేకమంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేలు కూడా అందరికీ అందకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది నాయకుల్ని వరదసాయంపై ప్రజలు నిలదీసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.