యాప్నగరం

వైన్ షాపులు మూసేయాలి.. చీపుర్లు పట్టిన మహిళలు, సికింద్రాబాద్‌లో ఘర్షణ

Secunderabad | మద్యం షాపులు మూసేయాలంటూ మహిళలు చీపుర్లు పట్టారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. మహిళలకు, వైన్ షాప్ నిర్వాహకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

Samayam Telugu 1 Nov 2019, 11:35 pm
సికింద్రాబాద్‌లో వైన్ షాపులు మూసేయాలంటూ మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. నూతనంగా ఏర్పడిన వైన్ షాపుల కొంత మంది మహిళలు చేతిలో చీపుర్లు పట్టుకొని ఆందోళన నిర్వహించారు. సికింద్రాబాదులోని పార్సిగుట్ట, మైలర్ గడ్డ వైన్ షాపులు.. స్కూళ్లకు, ఆసుపత్రులకు దగ్గరలో ఉన్నాయని.. వాటిని తొలగించాలని డిమాండ్ చేశారు.
Samayam Telugu protest


పార్సిగుట్ట వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. వైన్ షాప్ నిర్వాహకులు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం దుకాణంలోకి సామగ్రి పోకుండా మహిళలు అడ్డుపడ్డారు. వైన్ షాప్ సిబ్బంది వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మద్యం సీసా పగిలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి.

Must Read: కేటీఆర్‌ పరిశ్రమల మంత్రి కావడం మన అదృష్టం: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

ఈ ఘటనతో ఆగ్రహించిన మహిళలు వైన్ షాప్ తలుపులను పగలగొట్టే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఇరుపక్షాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. గాయపడిన మహిళను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.