యాప్నగరం

‘మొక్కలు నాటకపోతే వేటేస్తారా? మేమేమన్నా మీ ఇంటి నౌకర్లమా?’

Telangana | ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సర్పంచ్‌లను బలి చేసేలా ఉందంటూ యాదాద్రి జిల్లా ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. హరితహారం నిబంధనలపై ప్రభుత్వాన్ని నిలదీశారు.

Samayam Telugu 5 Sep 2019, 12:12 pm
తెలంగాణలోని పల్లెల్ని ప్రగతిబాట పట్టించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దీనికి కోసం 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మొదట 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఇటీవల ఉన్నతాధికారులు, ప్రజప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. సెప్టెంబర్ 6 నుంచే కార్యాచరణను అమలు చేయాలని సూచించారు.
Samayam Telugu Pailla


ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లోని కలెక్టర్లు, ఎమ్మెల్యేలు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా పరిధిలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్‌‌లతో బుధవారం అవగాహన సదస్సులు నిర్వహించారు.
Read Also: సీఎం పదవి కోసం చాప కింద నీరులా హరీశ్: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు
జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ రమేశ్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డ, గొంగిడి సునీత, అధికారులు పాల్గొని 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు.

అయితే, హరితహారం కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలపై సర్పంచ్‌లు అసహనం వ్యక్తం చేశారు. మొక్కలు నాటకుంటే, నాటిన మొక్కలు బతకకుంటే సర్పంచ్‌ల పైనే వేటేస్తారా? మేమేమన్నా మీ ఇంటి నౌకర్లమా? అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపోతే మొక్కలు ఎక్కడ నాటాలని అధికారులను ప్రశ్నించారు.
Read Also: చింతమడకలా చేయండి సార్.. కేసీఆర్ ఫోటో వద్ద మద్యం ఉంచి!
ఉన్న కొద్దిపాటి ఖాళీ ప్రదేశాల్లో నాటిన మొక్కలను కోతులు పీకేస్తున్నాయనీ, ఈ సమస్య గురించి అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు నిధులు మంజూరు చేయకుండా 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఎలా అమలు చేయగలమంటూ నిలదీశారు. ఈ కార్యక్రమం సర్పంచ్‌లను బలి చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పంచాయతీల్లో కార్యాలయాల కోసం ఏర్పాటు చేసుకున్న భవనాల అద్దె కూడా చెల్లించే పరిస్థితి లేదని సమావేశంలో సర్పంచ్‌లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకే స్థలం లేదనీ, ఇక శ్మశానాలు ఎలా నిర్మిస్తామని చెప్పారు. గ్రామాల్లో ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి, పంచాయతీలకు అప్పగించాలని కోరారు.
Read Also: వలస నేతలకు పీసీసీ పగ్గాలా.. వీహెచ్ హాట్ కామెంట్స్undefined
ఇటీవల నల్లగొండలో సర్పంచ్‌ను తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మనుషుల్ని కరుస్తున్న కుక్కలను చంపేస్తే కూడా సర్పంచ్‌లను సస్పెండ్ చేస్తారా అంటూ నిలదీశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక విజయవంతం అయితే, ప్రభుత్వ ఖాతాలో వేసుకుని, విఫలమైతే సర్పంచ్‌లపై వేటేస్తారా? అని మండిపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.