యాప్నగరం

ఖమ్మం: కరోనా భయంతో ఊరెళ్లాడు.. అక్కడే యువకుడ్ని కాటేసిన మృత్యువు

లాక్‌డౌన్‌ విధించడంతో హైదరాబాద్‌లో ఉండిపోయిన లక్ష్మణరావు కొద్ది రోజుల క్రితం సొంత ఊరు వచ్చాడు. సరదాగా స్థానిక చెరువులో చేపల పట్టేందుకు కొందరు స్థానికులతో కలిసి వెళ్లాడు.

Samayam Telugu 4 Jun 2020, 9:33 am
కరోనా భయంతో సొంత ఊరెళ్లిన యువకుడ్ని పిడుగు రూపంలో మృత్యువు కాటేసింది. స్థానికులతో కలిసి సరదాగా చేపలు పట్టడానికి వెళ్లిన సమయంలో ఈ విషాద ఘటన జరిగింది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన తల్లిదండ్రులకు తీరని విషాదాన్ని నింపింది. వేంసూరు మండలం దుద్దేపూడికి చెందిన నంద్యాల ఇద్దరు కూతుళ్లు, కుమారుడు లక్ష్మణరావు ఉన్నారు. కొడుకు హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
Samayam Telugu young man died after thunderbolt at khammam district
ఖమ్మం: కరోనా భయంతో ఊరెళ్లాడు.. అక్కడే యువకుడ్ని కాటేసిన మృత్యువు


లాక్‌డౌన్‌ విధించడంతో హైదరాబాద్‌లో ఉండిపోయిన లక్ష్మణరావు కొద్ది రోజుల క్రితం సొంత ఊరు వచ్చాడు. సరదాగా స్థానిక చెరువులో చేపల పట్టేందుకు కొందరు స్థానికులతో కలిసి వెళ్లాడు. కొద్దిసేపట్లో ఇంటికి వెళదామనుకున్నాడు.. ఇంతలోనే ఆ చెరువు సమీపంలో పిడుగుపడింది. ఆ పిడుగు దెబ్బకు లక్ష్మణరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. మిగిలినవారు ఆ ప్రదేశానికి దూరంగా ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అప్పటి వరకు కళ్ల ముందు తిరిగిన కుమారుడు ఇలా అనుకోని విధంగా చనిపోతాడని ఊహించలేదని తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.