యాప్నగరం

హైదరాబాద్: రెండ్రోజుల్లో ఎంగేజ్‌మెంట్.. యువకుడి మృతి

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన యువకుడు.. ట్రైనింగ్‌కు వెళ్లాలి. రెండు రోజుల్లో ఎంగేజ్‌‌మెంట్.. ఇంతలోనే వెంటాడిన మృత్యువు. హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ఘటన.

Samayam Telugu 13 Nov 2019, 8:48 am
జీవితంలో ఎన్నో కష్టాలుపడ్డ యువకుడు చివరికి అనుకున్నది సాధించాడు. ఉద్యోగం రావడంతో తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని కలలు కన్నాడు. పెళ్లి కూడా సిద్ధమయ్యాడు. మరో రెండు రోజుల్లో ఎంగేజ్‌మెంట్ జరుగుతుందనగా.. రైలు రూపంలో మృత్యువు వెంటాడింది. యువకుడి ప్రాణాలను బలికొనింది.. హైదరాబాద్ రాంనగర్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్నినింపింది.
Samayam Telugu hyderabad


హైదరాబాద్ రాంనగర్‌ డివిజన్‌ అంబేద్కర్ నగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌‌కు విజయలక్ష్మిలకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు. విజయ్‌కుమార్ ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థికంగా అంతంతమాత్రంగానే ఉంది. ఇక చిన్న కుమారుడు కళ్యాణ్‌ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు.. కానీ రెండుసార్లు విఫలమయ్యాడు. తర్వాత మూడోసారి ఉద్యోగం సంపాదించాడు. కొడుక్కి ఉద్యోగం రావడంతో.. పెళ్లి కూడా నిశ్చియించారు. ఈ నెల 14న ఎంగేజ్‌మెంట్ జరగాల్సి ఉంది.. 28న కానిస్టేబుల్ ట్రైనింగ్‌కు వెళ్లాల్సి ఉంది.

ఈ క్రమంలో సోమవారం ఉదయం బయటకు వెళ్లిన కళ్యాణ్.. విద్యానగర్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా ట్రైయిన్ ఢీకొట్టడంతో చనిపోయాడు. ముందు రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిగా భావించారు.. మంగళవారం కళ్యాణ్‌ను కుటుంబసభ్యులు గుర్తించారు. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా.. ఇలా కొడుకు అనుకోని ప్రమాదంతో చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.