యాప్నగరం

హైదరాబాద్‌లో విషాదం.. చెల్లి పుట్టినరోజే అన్నయ్య దుర్మరణం

చెల్లి ఇంటికి వెళ్లిన అన్నయ్య.. బర్త్ డే కోసం కేక్ బిర్యానీ తెస్తానని కాల్ చేశాడు. ఇంతలో ఫ్రెండ్ కొత్త బైక్ పై ట్రయల్ వేద్దామని కాస్త దూరం వెళ్లాడు.

Samayam Telugu 29 Dec 2020, 8:55 am
చెల్లి పుట్టిన రోజే అన్నయ్య దుర్మరణం చెందాడు. బర్త్ డే కేక్‌తో పాటు... బిర్యానీ తీసుకొస్తానని వెళ్లిన అన్న తిరిగి ఇంటికి చేరలేదు. ఈ ఘటన హైదరాబాద్ మల్లాపూర్‌లో జరిగింది. బీహార్‌కు చెందిన ఓ కుటుంబం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. రాహుల్ ఆదివారం చెల్లి వీణ పుట్టినరోజు కావడంతో స్నేహితుడితో కలిసి ఈసీఐఎల్ వెళ్లాడు. అక్కడ మిగిలిన మిత్రులతో టీ తాగి, తన స్నేహితుని కొత్త బైక్‌ను ఒకసారి ట్రయల్‌ వేద్దామని తీసుకున్నాడు. అర కిలోమీటరు వెళ్లగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి ఏఎస్‌రావుగనర్‌-ఈసీఐఎల్‌ ప్రధాన రహదారిలో కమలానగర్‌ వద్ద విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
Samayam Telugu మల్లాపూర్ రోడ్డు ప్రమాాదం
bike accident


Read More: తాళిబొట్టు తీసేసి... నవవధువు సూసైడ్ నోట్

చనిపోయే ముందు వీణకు ఫోన్ చేసిన రాహుల్ బర్త్ డే కేక్‌తో పాటు బిర్యానీ కూడా తీసుకొస్తానన్నాడు. దీంతో ఈ మాటలే తన చివరి మాటలు అయ్యాయి. రాహుల్ తండ్రి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ తన ముగ్గురి పిల్లలను చదివిస్తున్నాడు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన రాహుల్‌ రెండేళ్లుగా చర్లపల్లి పారిశ్రామికవాడలోని ఓ ఇంజినీరింగ్‌ వర్క్స్‌ పరిశ్రమలో పనిచేస్తూ ఇంటికి ఆసరగా నిలుస్తున్నాడు. రాహుల్ అంకురసంస్థ స్థాపించి తనతోపాటు మరో పది కుటుంబాలకు ఉపాధి ఇవ్వాలన్న ఆశలు ఆవిరైపోయాయంటూ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఇదే ప్రమాదంలో రాహుల్‌ వెనకాల కూర్చున్న మల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన మనీష్‌ అనే మరో యువకుడికి కూడా తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.