యాప్నగరం

బెట్టింగుల కోసం దారుణం.. తల్లి సోదరికి విషం పెట్టిన యువకుడు

విషం తిన్న సోదరి ఈనెల 27న మృతిచెందగా.. తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తండ్రి కూడా ఇటీవల చనిపోవడంతో ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం కొడుకు కొంతకాలంగా వేధింపులకు దిగాడు.

Samayam Telugu 30 Nov 2020, 7:37 am
కన్నతల్లికే విషం పెట్టాడు ఓ కసాయి కొడుకు. అంతేకాదు తోబొట్టువు కూడా అదే విషం పెట్టి ఇద్దరి ప్రాణాలు తీశారు. డబ్బుల కోసం, ఆస్తుల కోసం కొందరు కసాయి కొడుకులు ఎంతటి దారుణాలకు అయినా ఒడిగడతాడరని ఈ సంఘటన ఉదాహరణ. జల్సాలకు బానిసై..ఈజీ మని కోసం ఐపీఎల్ బెట్టింగులకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి ఇన్స్యూరెన్స్ డబ్బుల కోసం తల్లిని సోదరిని వేధించుకు తిన్నాడు. డబ్బుల ఇవ్వమని చెప్పడంతో ఇద్దర్నీ చంపేందుకు విషం పెట్టాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
poison


Read More: Tiger Attack: చేనులో పత్తి తీస్తున్న బాలికపై పెద్ద పులి దాడి

మేడ్చల్ రావలకోల్ గ్రామానికి చెందిన సాయి రెడ్డి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఐపీఎల్‌లో బెట్టింగులు కూడా పెట్టాడు. వీటికోసం తండ్రి ప్రభాకర్ రెడ్డి ఇటీవల అకాల మరణాన్ని చెందడంతో అతడి పేరిట ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులు 20 లక్షలు నొక్కయాలనకున్నాడు. ఐపీఎల్ కి బానిసైన సాయి రెడ్డి అప్పులపాలు అవడంతో తల్లిని సోదరిని ఇన్సూరెన్స్ లో వచ్చిన డబ్బులు కొరకు వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 23న వారిద్దరికీ అన్నంలో విషం కలిపి హత్యాయత్నం చేశాడు. అది తిన్నసోదరి అనూష ఈనెల 27న మరణించింది. మరణించగా తల్లి సునీత రెడ్డి కూడా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.