యాప్నగరం

హైదరాబాద్‌లో దారుణం.. ఆరోగ్యం సరిగాలేదని యువకుడు ఆత్మహత్య

మాల్బర్ పనులు చేస్తున్న విజయ్ సింగ్ యూపీ నుంచి పొట్ట కూటీ కోసం నగరానికి వచ్చాడు. అయితే గత కొన్ని రోజులుగా తన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

Samayam Telugu 1 Oct 2020, 7:22 am
హైదరాబాద్‌లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆరోగ్య పరిస్థితిలేక ఆందోళనకు గురైన అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈఘటన బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం జాన్సీకి చెందిన విజయ్‌సింగ్‌(25) రెండు సంవత్సరాల క్రితం ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. మార్బుల్‌ పాలిషింగ్‌ పనులు చేసుకుంటూ బోయిన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద ఉన్న నందమూరినగర్‌ బస్తీలో నివాసముంటున్నాడు.
Samayam Telugu యువకుడి ఆత్మహత్య
man suicide


Read More: ఎమ్మెల్సీగా కవిత గెలుపు కోసం టీఆర్ఎస్ నేతల పక్కా ప్లాన్

అతనితో పాటు రూమ్‌లో మరో ఇద్దరు యువకులు కూడా కలిసి ఉంటున్నారు. అయితే ఈ నెల 29న పనులకు వెళ్లి రాత్రి ఇంటికి తిరిగొచ్చారు. రూంలో విజయ్ సింగ్ ఉన్నాడు. అయితే ఎంత కొడుతున్నా తలుపులు తీయకపోవడంతో.. స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలుకొట్టారు. లోపల విజయ్‌సింగ్ వెంటిలేటర్‌ కిటికీకి తాడుతో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు. దీంతో వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.