రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య.. అకాడమీ వేధింపులే కారణం?
రైలు కింద పడి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చేసుచేసుకుంది. అకాడమీ వేధింపులు అతడు బలవన్మరణానికి పాల్పడటానికి కారణమని తెలుస్తోంది.
Samayam Telugu 13 Dec 2019, 11:29 pm
హైదరాబాద్: రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదర్గూడలోని నలంద నగర్ కాలనీలో ఉన్న శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీలో కోచింగ్ తీసుకుంటున్న పవన్.. రైలు కింద పడి దుర్మరణం బలవనర్మణం చెందాడు. ఆర్థిక సమస్యల కారణంగా అతడు ఫీజు చెల్లించలేకపోయాడని.. ఫీజు చెల్లించాలని అకాడమీ నుంచి ఒత్తిడి ఎక్కువైందని సమాచారం.
అకాడమీ వేధింపులు భరించలేకే నవీన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. విద్యార్థి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే అకాడమీ యాజమాన్యం పరారైంది. అకాడమీ తీరు వల్లే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ.. సహచర విద్యార్థులు అకాడమీ ముందు ఆందోళకు దిగారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అకాడమీ వేధింపులు భరించలేకే నవీన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. విద్యార్థి ఆత్మహత్య వార్త తెలిసిన వెంటనే అకాడమీ యాజమాన్యం పరారైంది. అకాడమీ తీరు వల్లే పవన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ.. సహచర విద్యార్థులు అకాడమీ ముందు ఆందోళకు దిగారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.